వివాహ భోజనంబు.. విషమాయె వంటకంబు...

 

పెళ్ళి భోజనం చేసిన 25 మంది అస్వస్థతకు గురైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో వున్న రగన్‌పురి గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో జరిగిన ఒక వివాహానికి పలువురు హాజరయ్యారు. అక్కడ భోజనం చేసిన వారు కొద్దిసేపటికే తలనొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. 25 మంది తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆహారంలో బల్లి పడటం వల్ల ఇలా జరిగి వుండవచ్చని భావిస్తున్నారు.