మావోల ప్రతీకారం.. కాంగ్రెస్ నేత అల్లుడిని కాల్చి చంపారు

 

ఆంధ్రా ఒడిశా (ఏవోబీ) సరిహద్దుల్లో ఈమధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు చాలామందే చనిపోయారు. అయితే ఎన్ కౌంటర్ తో తమకు జరిగిన నష్టానికి మావోలు పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న తరుణంలో ఓ దారుణానికి పాల్పడ్డారు. ఓ కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ అల్లుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. బీజాపూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో బీజాపూర్ ప్రాంతంలో పోలీసు బలగాలను భారీగా పెంచారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.