ఎక్స్‌ప్రెస్‌ రైలు పై మావోయిస్టులు దాడి

 

Maoist Rebel Attack on Train in India, Maoist Rebel Attack Train

 

బీహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ధన్‌బాద్ - పాట్నా ఇంటర్ సిటీ రైలు ఎక్స్‌ప్రెస్‌పై వంద మంది మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో రైలు డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. ఆర్‌పీఎఫ్ జవాన్ల లక్ష్యంగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. సంఘటనా ప్రదేశానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.