ఘనంగా మనోజ్-ప్రణతిరెడ్డి నిశ్చితార్ధం

మోహన్ బాబు తనయుడు యువ హీరో మంచు మనోజ్, ప్రణతిల నిశ్చితార్ధం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద, శ్యాంప్రసాద్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సహా పలువు రాజకీయ నేతలు కూడా ఈ నిశ్చితార్ధ కార్య్రక్రమానికి హాజరయ్యారు. పురోహితులు ప్రణతిరెడ్డితో గౌరీ పూజ, మనోజ్ తో పూజ చేయించారు. తరువాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. అందరూ ఈ నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.