తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని భార్యనే కాల్చేశాడు
posted on May 7, 2014 4:21PM
ఎన్నికల వేళ ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ వుంటాయి. అలాంటి విచిత్రం బీహార్లో జరిగింది. ఒక ప్రబుద్ధుడు తాను ఇష్టపడే పార్టీకి తన భార్య ఓటు వేయకపోయేసరికి ఆగ్రహం ఆపుకోలేకపోయాడు. నాటు తుపాకితో ఆమెని కాల్చిపారేశాడు. బీహార్లోని ఉజియార్పూర్ నియోజకవర్గం పరిధిలోని మొయినుద్దీన్ నగర్లో వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి ఒక పార్టీని ఎంతో ఇష్టపడతాడు. ఆ పార్టీకి కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు.
బుధవారం నాడు వినోద్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్కి వెళ్ళి వచ్చిన అతని భార్య తాను కార్యకర్తగా వున్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేసినట్టు చెప్పింది. అంతే ఉదయ్ పాశ్వాన్కి బీపీ పెరిగిపోయింది. తన దగ్గరే వున్న నాటు తుపాకితో భార్యని కాల్చేశాడు. ఆ తర్వాత బీపీ డౌన్ అయ్యాక తాను చేసిన తప్పు తెలుసుకుని పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కథలో సుఖాంతం ఏమిటంటే, తుపాకీ కాల్పుకు గురైన వినోద్ పాశ్వాన్ భార్య ప్రాణాలతో బయటపడింది.