గొంతులో ఇరుక్కున్న ఇడ్లీ ప్రాణం పోయింది...

 

టైమొస్తే తాడు పామై కరుస్తుంది. మృదువుగా వుండే ఇడ్లీ కూడా ప్రాణం తీస్తుంది. కేరళలో ఓనం పండగ సందర్భంగా ఇడ్లీ పోటీలు నిర్వహించారు. ఎవరు వేగంగా ఎక్కువ ఇడ్లీలు తింటే వాళ్ళు గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే ఇడ్లీలు వేగంగా తినే పోటీలో పాల్గొన్న కందముతన్ అనే 55 యేళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇడ్లీ పోటీల్లో కందముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించి.. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కందముతన్ మరణించాడని పోలీసులు తెలిపారు.