ఐదుగురిని మింగేసిన కరెంటు తీగలు

 

మధ్య ప్రదేశ్‌లోని భింద్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మీద విద్యుత్ తీగలు తెగి పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించారు. ఒక పెళ్ళి బృందానికి చెందిన బస్సు మొత్తం 60 మందితో ప్రయాణిస్తోంది. భింద్ సమీపానికి రాగానే బస్సుకి ఒక హై టెన్షన్ పోల్‌కి ఢీకొంది. ఆ పోల్‌కి వున్న విద్యుత్ తీగలు తెగి బస్సు మీద పడటంతో మొత్తం ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన పదిమందిని ఆస్పత్రికి తరలించారు. మొదట ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మృతుల సంఖ్య ఐదుగా పోలీసు వర్గాలు నిర్ధారించాయి.