పిచ్చమ్మ 'రాయి ఎటు వేస్తే అదే రాజధాని'

 

 

 

రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి ఆలసిపోయానని కాంగ్రెస్ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోనియా పిచ్చమ్మ 'ఎటు రాయి విసిరితే..అది రాజధాని' అవుతుందని తనదైన శైలిలో చమత్కరించారు. సోనియా ఎలా ప్రవర్తిస్తారో మనందరికి తెలుసునని అన్నారు. సీమాంధ్ర ప్రాంత రాజధానిగా 'మాచర్ల' అందరికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని తన మనసులోని మాటను బయటపెట్టారు. లోక్ సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.