కొండచరియ విరిగిపడి 19 మంది దుర్మరణం

 

చైనాలోని షాంక్సి ప్రావినెన్స్‌లో శుక్రవారం రాత్రి కొండ చరియలు విరిగిపడటంతో 19 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు నిద్రిస్తున్న తాత్కాలిక నివాసాల మీద కొండ చరియలు విరిగిపడటంతో ఈ దారుణం జరిగింది. తొమ్మిదిమంది సంఘటనా స్థలంలో మరణించగా, మిగిలినవారు ఆస్పత్రిలో మరణించారు. కొండ చరియల శిథిలాల కింద మరికొంతమంది వుండే అవకాశం వుందని అనుమానిస్తున్నారు.