చంద్రబాబుని శపిస్తున్న లక్ష్మీ పార్వతి

 

స్వర్గీయ ఎన్.టి.రామారావుగారి హయంలో అటు తెలుగుదేశం పార్టీన్ని, ఇటు నందమూరి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకొన్న లక్ష్మీపార్వతి, అయన పోయిన తరువాత రెంటికీ చెడిన రేవడిగా మిగిలిపోయింది. అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి కనీసం తానూ కూడా గెలవలేక చతికిలబడింది. నందమూరి కుటుంబాన్ని ఎంత మంచి చేసుకొందామని ప్రయత్నించినా ఎవరూ కూడా స్పందించకపోవడంతో, ఏక సభ్య పార్టీగా కొంత కాలం పార్టీని నడిపించి చివరికి జగన్ పార్టీలో తెలిందామె. అయితే, ఆమె ఆవేశం, ఆక్రోశం ఎన్నటికీ చల్లారేది కాదని అందరికి తెలుసు. ఈ రోజు తన భర్త నందమూరి తారకరామారావు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆమె ఈ ఉదయం యన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు.

 

ఆ సందర్బంగా మీడియవారితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం అని చెపుతూ చంద్రబాబు నాయుడుకు తన భర్త యన్టీఆర్ శాపం తగిలినందునే ఈనాడు ఈ విధమయిన కష్టాలు అనుభవిస్తున్నాడని ఆమె అన్నారు. అంతేగాకుండా, ఆమె తెలుగుదేశం పార్టీ జాతకం కూడా చెప్పారు. ఆంధ్ర, తెలంగాణా, జగన్ మోహన్ రెడ్డిల వల్ల, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నారు. రేపు జగన్ పార్టీ కూడా ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇలాగే శాపాలు పెడుతుందేమో తెలియదు.