లోక్‌సభలో పెప్పర్ స్ప్రే...లగడపాటికి అస్వస్థత

 

 

లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును షిండే ప్రవేశపెట్టిన వెంటనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర ఎంపీల వైఖరితో లోక్‌సభ మరోసారి రణరంగంగా మారింది. లోక్‌సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎంపీ లగడపాటి సభలో పెప్పర్ స్ప్రే చల్లడంతో పలువురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు, కళ్ల మంటలతో అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ సభ్యులు లగడపాటిని పక్కకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన మిరియాల పొడిని తన పైనే ప్రయోగించుకున్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.