ఉద్యోగుల సమ్మె వద్దు

 

 Lagadapati, Telangana lagadapati, Telangana issue Lagadapati

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల12 నుండి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి నోటీసు కూడా ఇచ్చారు. దీంతో తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ తాము కూడా సమ్మెకు వెళ్తామని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లొద్దని, సమ్మెల మూలంగా ప్రజలు ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు జీతాలు కోల్పోతారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తాము అన్ని విధాలుగా పోరాడుతున్నామని, ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకోవాలని ఆయన అన్నారు.