వై.ఎస్.ఆర్.సి.పి. లో చేరనున్న కూన శ్రీశైలం

 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ వై.ఎస్.ఆర్.సి.పి.లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూన శ్రీశైలం గౌడ్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ కు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్ట్టబెట్టారు. 2002-07 వరకు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ ను ములాఖత్ సమయంలో కలుసుకుని మంతనాలు జరిపారు. నియోజకవర్గంలోని బస్తీ నాయకులతో పలుమార్లు సమావేశమైన శ్రీశైలం వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన వైఎస్సార్సీపీ పార్టీలు చేరుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.