ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం..

 

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.  రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. అంతే కాదు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.