తెలంగాణ భవన్‌‌లో బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్

భారీ జనసందోహం నడుమ తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్రసమితి కార్య నిర్వాహక అధ్యక్షునిగా ఈ రోజు (సోమవారం) కేటీఆర్‌ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్‌ ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. తొలుత తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు చేపటారు. ఈ కార్యక్రమాన్ని తెరాస శ్రేణులు భారీ జనసందోహం నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రకమంలో హరీశ్‌రావు, మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ నేతలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యనిర్వాహక హోదాలో జిల్లాలు పర్యటిస్తానని కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 20న జనగామ, వరంగల్‌ జిల్లాలకు వెళ్తున్నారు. పార్టీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన,  కార్యకర్తలు, ప్రజల కృతజ్ఞత సభల్లో పాల్గొంటారు.