సమస్యలపై చర్చకు రెడీ.. కేటీఆర్

 

తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నించినా వదలబోమని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారు. కరెంట్ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.