దొరగారి చెప్పులా.. మజాకా

 

 

 

బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ వాళ్లు తెచ్చిపెట్టిన దొరతనం మాత్రం మనను వదల్లేదు. కాస్త పదవి రాగానే తమను తాము దొరలుగా భావించుకోవడం నాయకులకు మామూలైపోయింది. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇదే కోవలోకి వెళ్లిపోయారు. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా గుడిపాడులో ఒక ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్కనే ఉన్న చనుగొండ్ల పంచాయతీ సర్పంచ్ సుజాతమ్మ భర్త జి.రంగనాయకులు.. మంత్రి చెప్పులు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వాటిని శుభ్రం చేసి కోట్ల పాదాలకు తొడిగారు. ఇదంతా మామూలే అన్నట్లుగా, అసలు అలా జరుగుతున్నట్లు కూడా పట్టించుకోకుండా కోట్ల వ్యవహరించారు.