జగన్ గూటికి ఎమ్మార్ కోనేరు ప్రసాద్!

 

 

 

ఎమ్మార్ కేసులో ప్రధాన నిదితుడు కోనేరు రాజేంద్ర ప్రసాద్ త్వరలో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైకాపా తరపున విజయవాడ నుండి ఎంపీ స్థానానికి కోనేరు ప్రసాద్ పోటీ చేస్తారని అంటున్నారు. దీనిపై వైకాపా నేతల నుంచి కానీ కోనేరు రాజేంద్ర ప్రసాద్ కుటుంబసభ్యుల నుంచి గాని ఎలాంటి స్పందన లేదు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.