కొండా దంపతులకు బీజేపీ గాలం
posted on May 10, 2013 8:39AM
వైకాపా విషయంలో అలక వహించిన కొండా మురళి దంపతులకు బీజేపీ గాలం వేస్తోంది! వారిని తమవైపుకు తిప్పుకోవాలని చూస్తోంది! అటు వైఎస్ఆర్.సీపీలో కొనసాగలేక ,ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లలేక , కేసీఆర్ కింద పొదగలేక పోతున్న వారికి అన్ని విధాలా ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ అభయం ఇస్తోంది! ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొండా దంపతులకు ఫోన్ చేసి హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. ఇప్పటికే ఏ పార్టీకీ చెందకుండా ఉండిపోయిన నాగం జనార్ధన్ రెడ్డిని బుట్టలోకి వేసుకున్న బీజేపీ ఇలాంటి సందిగ్ధవస్థలో ఉన్న నేతలను తమవైపు తిప్పుకోవడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సురేఖ, మురళిలపై గాలం వేసింది. మరి వీరి గాలానికి వారు పడతారో లేదో?