కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య

 

 Kishan Reddy Fires on MIM Party, Kishan Reddy MIM Party, kishan reddy narendra modi

 

 

బీజేపీ ప్రచార సారథి, గుజరాత్ సీఎం నరేంద్రమోదీ హైదరాబాద్‌లో ప్రారంభించిన 'నవభారత యువభేరి' సభలో కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఒక పోలీసు అధికారిని డ్రెస్ విప్పుతాం అంటూ మజ్లిస్ నేతలు బెదిరిస్తే,వారికి ప్రభుత్వం లొంగిపోయిందని, ఆ అధికారినే బదిలీ చేసిందని ఆయన అన్నారు. "అదే మా ప్రభుత్వం ఉంటే... వారి బట్టలు విప్పించే వాళ్లం'' అని మజ్లిస్ నేతలనుద్దేశించి ఆయన విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయని, గూండాయిజం, రౌడీయి జం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిజాం సొత్తు కాదని ఎంఐఎంపై ధ్వజమెత్తారు.