మార్చి 2న సీఎం కిరణ్ కొత్త పార్టీ !

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో భేటి అయిన పార్టీ విధి, విధానాలు ఎలా వుండాలనే అంశపై చర్చించినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు జేసీ దివాకరరెడ్డి, గాదె వెంకటరెడ్డి, కొర్ల భారతి, రౌతు సూర్యప్రకాశ రావు, వంగా గీత, పంతం గాంధీ, అంజిబాబు, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, ఇందిర, లక్ష్మీశివకుమారి, రెడ్డప్పరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, విజయరామిరెడ్డి, ప్రభాకర రెడ్డి, వెంకటరమణలతో కిరణ్ సమావేశమయ్యారు. ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. దాదాపు ఇంటర్య్వూ స్థాయిలో సాగిన ఈ అభిప్రాయ సేకరణలో కొత్త పార్టీ స్థాపన అంశం ప్రస్తావించారు. యువత, మహిళలు, ఉద్యోగులే లక్ష్యంగా కిరణ్ కొత్త పార్టీని స్థాపించనున్నారు. మార్చి 2న తిరుపతి లేదా రాజమండ్రిలో భారీ బహీరంగసభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.