టి నాయకులపై నోరు జారిన కిరణ్
posted on Jun 12, 2013 6:59PM
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్వపక్షం నుండే విమర్శలు వచ్చాయి. తాజాగా శాసనసభ సమావేశాల నేపథ్యంలో నీలం తుఫాను బాధిత రైతులకు, వడగండ్ల మూలంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అసేంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదుట బైఠాయించారు. దీంతో అటుగా వచ్చిన ముఖ్యమంత్రి “నాటకాలు ఆపి ఛాంబర్ లోపలకు వస్తే మాట్లాడదాం” అని అన్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ రైతుల సమస్యల గురించి మాట్లాడితే డ్రామాలని అవమానిస్తారా ..వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అసేంబ్లీలో హరీష్ రావును ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడితే ఒక్క పైసా కూడా ఇవ్వను ..ఏం చేసుకుంటారో ? ఏం రాసుకుంటారో ? చేసుకోండి అని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.