కాంగ్రెస్ పార్టీని వీడను: సబిత

 

kiran kumar reddy sabita, sabita congress, sabita indra reddy congress

 

 

''కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. నిబంధనల ప్రకారమే అంతా చేశాం. నా మీద పెట్టిన కేసు విషయంలో న్యాయపోరాటం చేస్తాను. జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన నాకు ఇది లెక్కకాదు. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలి. నేను హోంమంత్రిగా ఉన్నా కార్యకర్తగానే పనిచేశా. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా ప్రయత్నం నేను చేస్తాను” అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె రాజీనామా కు నిరసనగా ఆమెకు మద్దతుగా నిరసనలు మిన్నంటాయి. సబిత రాజీనామా ఆమోదించవద్దని మహేశ్వరంలో ఆమె అభిమానులు నిరసన కార్యక్రమాలు చేప్టారు. మందమల్లమ్మ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు. సబితను మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, వట్టి వసంత్ కుమార్, మాజీ ఎంపీ కేశవరావులు కలిసి పరామర్శించారు. రాజీనామా చేసినందుకు బాధపడవద్దని ధైర్యం చెప్పారు. మరో వైపు రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి కూడా ఆమెను కలిశారు.