వచ్చే ఎన్నికల్లో కిరణ్ పోటి చేయరు!
posted on Jun 12, 2013 11:08AM
మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్ర రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శల ఘాటును పెంచారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై ఆగ్రహంతో ఉన్న డి.ఎల్. ముఖ్యమంత్రి పై విరుచుకుపడుతున్నారు. కిరణ్ బ్రదర్స్ జైలు కు వెళ్ళే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్న విషయం ముఖ్యమంత్రికి తెలుసునని, అందువల్ల ఆయన ఎన్నికల్లో పోటిచేయకపోవచ్చునని రవీంద్రరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదివి నుంచి కిరణ్ దీగిపోయాక అమెరికా వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నారని కూడా రవీంద్ర రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని కిరణ్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కిరణ్ సోదరులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారని, అదే నిజమనిపిస్తోందన్నారు.