అది ఉండవల్లి వ్రాసిచ్చిన స్క్రిప్టేనా



 

తెలంగాణా బిల్లు వివిధ దశలలో ఉన్నప్పుడు మాట మాట్లాడకుండా కూర్చుని, లాస్ట్ బాల్ ఇంకా ఉందంటూ కామెంట్లు చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాత్రం తెలుగు మంత్రం జపిస్తున్నారు. తెలుగువాళ్ల ఐక్యత కోసమే తాను రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 12వ తేదీన రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి, అక్కడ పార్టీ ప్రకటిస్తానని చెప్పిన ఆయన.. ఈలోపు తాను సమైక్య రాష్ట్రం కోసం ఎంతగా ‘పోరాడానో’ చెబుతున్నారు. మిగిలిన పార్టీల మీద పనిలోపనిగా దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, పరువు ప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి, తెలుగువారి సర్వతోముఖాభివృద్ధికి తన జీవితాన్ని అంకితమిస్తున్నట్లు కిరణ్ తాజాగా చెప్పారు. తెలుగుజాతిని విభజించి, అవమానించినందువల్లే పదవిని వదులుకోవడంతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని వివరించారు. తన పాలనలో సామాన్యుడి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పథకాలు అమలవుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుట్రపన్ని విభజన చిచ్చుతో నాశనం చేశాయని ఆరోపించారు. దటీజ్ కిరణ్. ఇంతకీ ఈ స్క్ర్రిప్టు అంతా ఇచ్చింది మాత్రం ఉండవల్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.