కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి టిడిపియే
posted on Mar 14, 2013 4:23PM
వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి టిడిపియేనని సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టే ఘన విజయం సాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ తమ పార్టీకి దూరమైనా మైనారిటీలు తమవైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్న వారికి కొందరికి సీట్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. అవసరమైతే కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశమిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించిన వారికే సీట్లు దక్కుతాయని, లేకుంటే లేదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలకు ముందే ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఆయన వివరించారు.