పివి ని కిరణ్ ఎలా స్మరించుకొన్నారంటే....

 

Kiran kumar reddy, P. V. Narasimha Rao, P. V. Narasimha Rao Kiran kumar reddy, congress P. V. Narasimha Rao

 

 

దివంగత ప్రధాన మంత్రి పి.వి.నరసింహా రావుకు తన తండ్రి అమర్ నాధ్ రెడ్డి నమ్మిన బంటుగా ఉండేవారని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కిరణ్ తన కుటుంబానికి పి.వి. తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

 

తన వివాహానికి హాజరు కావడం కోసం ఆ సమయంలో రష్యాలో ఉన్న పి.వి. ఎంతో శ్రమకోర్చి నాలుగు విమానాలు మారి వచ్చి హాజరయ్యారని కిరణ్ గుర్తు చేసుకున్నారు.



‘1987 లో రాష్త్రపతి ఎన్నికల సమయంలో ఓ దశలో ఆ పదవికి పి.వి. పేరు పరిశీలనలోకి వచ్చింది. దీనితో, ఆయన తన తండ్రికి చేసి, తన స్వగ్రామానికి వెళ్లి ఓటర్ల జాబితా తీసుకురమ్మని చెప్పారు. ఈ విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు’, అని కిరణ్ అన్నారు.



అంతే కాదు, తన తండ్రి మరణించినప్పుడు పి.వి. స్వయంగా పాడె మోశారని ముఖ్య మంత్రి గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న వారికి ఆయన ఏ స్థాయిలో అయినా సహాయపడేవారని కిరణ్ అన్నారు.



పి.వి. తనను ముందుగా పార్లమెంట్ కు పోటీ చేయమని సలహా ఇచ్చారని, అయితే,తాను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తానని పట్టుబట్టానని ముఖ్య మంత్రి దివంగత ప్రధానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.