కనీసం ఇద్దర్ని పెళ్లి చేసుకోకపోతే యావజ్జీవ శిక్షే

 

మనదేశంలో మహిళల జనాభా కంటే పురుషుల జనాభా అధికం. దీంతో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు నానా తిప్పలు పడుతున్నారు. అయితే ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దేశంలోని మేజర్ అయిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 ఆదేశాలు జారీచేశారు.

స్వాజిలాండ్ లో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా అధికం. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని రాజు మెస్వాతి-3 ఆదేశాలు జారీచేశారు. ఇందుకు 2019, జూన్ నెలను తుది గడువుగా నిర్ణయించారు. ఈలోగా పెళ్లి చేసుకోకుంటే యావజ్జీవ శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయితే ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకునేవారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు.  

అన్నట్లు ఇలాంటి విచిత్ర ఆదేశాలు జారీచేసిన మెస్వాతి-3కి 15 మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు. ఇక మెస్వాతి-3 తండ్రికి అయితే.. 70 మంది భార్యలు, 150 మందికిపైగా సంతానం ఉన్నారట. కాగా, ఇలాంటి చర్యల వల్ల దేశం మరింత పేదరికంలోకి పోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా స్వాజిలాండ్ రాజు మెస్వాతి-3 మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు.