ఖమ్మం టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగ

 

సాధారణంగా ఎన్నికల ప్రచారానికి సభలు నిర్వహిస్తారు.కానీ ఇందుకు భిన్నంగా ఓ నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నిర్వహించటం అరుదు.ఖమ్మం జిల్లా  వైరా నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ని మార్చాలని ఆ పార్టీ అసంతృప్తి నేతలు డిమాండ్‌ చేశారు. ఐదుమండలాల నుంచి వేలాదిమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులను అసంతృప్తులు సమీకరించి వైరాలో భారీ బలప్రదర్శన, సభ నిర్వహించారు.టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నాయకుడు బొర్రా రాజశేఖర్‌ అధ్యక్షతన ఈ సభ జరిగింది.గత నాలుగేళ్లలో మదన్‌లాల్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను అనేక కేసుల్లో ఇరికించి వేధించారని విమర్శించారు. తనకు నచ్చని నాయకులు, కార్యకర్తలను జైలుపాలు చేశారని విమర్శించారు.మదన్‌లాల్‌ వైరాలో పోటీచేస్తే టీఆర్‌ఎస్‌ను ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వేరే ఏ నాయకుడినైనా వైరాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెడితే గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇస్తామని ప్రకటించారు.మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని మార్చాలనే డిమాండ్‌తో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన అసంతృప్తి నేతలు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు లంబాడీ తండా నుంచి బయల్థేరి వెళ్తున్న ఎంపీ వర్గీయులకు ఆ ర్యాలీని వ్యతిరేకించిన మదన్‌లాల్‌ వర్గీయులు పరస్పరం ఎదురు దాడి చేసుకున్నారు.ఓ వైపు వర్గ పోరు మరో వైపు అసంతృప్తి సభలు దీంతో మదన్ లాల్ గెలుపు కన్నా ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి అభ్యర్థిని మార్చి పార్టీని గెలిపించుకుంటారో?లేదో?