తుమ్మల టీఆర్ఎస్ తీర్థం.. 5 వరకూ సస్పెన్స్...

 

ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టుగా కొంతమంది ఔత్సాహికులు కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే తుమ్మల టీఆర్ఎస్‌లో చేరేదీ లేనిదీ సస్పెన్స్‌గా వుంది. ఈమధ్య ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన తుమ్మల తన ఆరోగ్యం కొంత మెరుగు కావడంతో డిశ్చార్చి అయ్యారు. ఆయన శనివారం నాడు ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు తుమ్మల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల తాను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వెళ్లేదీ లేనిదీ సెప్టెంబర్ 5వ తేదీన చెబుతానని చెప్పారు.