గజ్వేల్ లో కేసీఆర్ ఘన విజయం

 

తెలంగాణ ఫలితాల్లో కారు జోరు చూపిస్తుంది. ఆ జోరుకి తగ్గట్టే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కేసీఆర్.. కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 50 వేలు పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ గజ్వేల్ నుంచే బరిలోకి దిగారు. అప్పుడు వంటేరు ప్రతాపరెడ్డి టీడీపీ తరుపున బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్, వంటేరుపై 19 వేలు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. తరువాత వంటేరు టీడీపీ ని కాంగ్రెస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో వంటేరు ప్రజకూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కేసీఆర్ పై 50 వేల మెజారిటీతో గెలుస్తానని సవాల్ కూడా విసిరారు. అయితే 50 వేల మెజారిటీ కాస్తా రివర్స్ అయింది. కేసీఆర్ వంటేరుపై 50 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు.