రాహుల్ కోరితే యుపిఏకి మద్దతిస్తా: కేసీఆర్

 

 

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాలుక మళ్ళీ మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని, పొన్నాల లక్ష్మయ్యని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పేరు పేరునా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోయి, పోలింగ్ మాత్రమే బ్యాలన్స్ వున్న సమయంలో ట్విస్ట్ ఇచ్చాడు. ఒక జాతీయ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలోని ఎన్డీయేకి తాను మద్దతు ఇవ్వనని చెప్పాడు. ఇది సంచలన ప్రకటన కాదు.. మోడీ ప్రస్తావన అయిపోయిన తర్వాత అసలు సంచలన ప్రకటన కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. రాహుల్ గాంధీ తనని కోరిన పక్షంలో యు.పి.ఎ.కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. దీంతోపాటు తెలంగాణ రావడానికి సోనియాగాంధీనే కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చేరువ కావడానికి కేసీఆర్ ఈ మాటలు మాట్లాడి వుండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలు నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అంటున్నారు.