తెలంగాణలో టీఆర్ఎస్: కేసీఆర్‌తో సీఐడీ డీజీ భేటి

 

 

 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ వచ్చే అవకాశాలు వుండటంతో టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తు్న్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలియగానే సీఐడీ డీజీ కృష్ణ ప్రసాద్ అధికారిక హోదాలో కేసీఆర్ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన చర్యల గురించి ఆయన కేసీఆర్‌తో చర్చించినట్టు తెలుస్తోంది.