కేసీఆర్‌ హత్య ఆరోపణలపై సోమిరెడ్డి స్పందన

 

 

 

కేసీఆర్‌ను హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న హరీష్‌రావు ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. 'కేసీఆర్‌ను హత్య చేయాల్సిన అవసరం మాకు లేదు. అంతటివాళ్లు కూడా ఆంధ్రాలో లేరు తెలంగాణలోనే అలాంటి అవసరం ఎవరికైనా ఉందో మీకే తెలియాలి' అని వ్యాఖ్యానించారు.

 

సీమాంధ్ర ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి..12 నుంచి ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.. విద్యా సంస్థలు, న్యాయస్ధానాలు పనిచేసే పరిస్థితి లేదు.. 5కోట్ల ప్రజల జన జీవనం ఆగిపోతే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు బాధ్యత లేదా? చూస్తూ ఊరుకొంటారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నక్సల్స్ ఎజెండానే తమ ఎజెండా అని కేసీఆర్ చెబుతున్నారు. అంటే ఇంటికో తుపాకి ఇస్తారా లేక ఉచిత తుపాకి పథకం పెడతారా? అని ప్రశ్నించారు.