కెసిఆర్ అన్న కుమార్తె ఇంటిపై టీఆర్ఎస్ దాడి!

 

TRS mahila karyakarthalu, KCR Telangana

 

 

తమ్ముడే తమ్ముడే...పేకాట పేకాటే అని చాలా మంది అంటుంటారు. రాజకీయాలలో కూడా అంతే బంధువైన, బయటవరైనా ఒకటే. టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు కెసిఆర్ అన్న కూతురు ఇంటిపై దాడి చేయడం విశేషం. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఈ నెల ఏడును కెసిఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించబోతున్న కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పోస్టర్ విడుదల కార్యక్రమంలో రమ్య పాల్గొని కెసిఆర్ ను విమర్శించారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి దాడులు చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం వుంది.