ఎవరి కాళ్ళు పట్టుకోలేదు: కావూరి

 

 

Kavuru Samba Siva Rao, Kavuri Samba Siva Rao congress, minister Kavuri Samba Siva Rao

 

 

కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కిన తర్వాత కావూరి తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి వచ్చిన సంధర్బంగా ఇండోర్ స్టేడియంలో ఆయనకు జిల్లా నేతలు సన్మానం చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్రానికి ఎక్కువగా నిదులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను పదవుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకోలేదని అన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి నిత్యం కార్యకర్తగానే పని చేశానని, ఏనాడు పదవి కోసం ఎదురు చూడలేదన్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి పదవి కోసం గట్టిగా ఆశించి,ఒక సందర్భంలో అలిగిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తనకు పదవీకాంక్ష లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.