నేను సమైక్యవాదినే: కావూరి
posted on Aug 10, 2013 11:55AM
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తాను సమైక్యవాదినేనని, యుటర్న్ తీసుకున్నాననడం వాస్తవం కాదని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు ఇంకా సంక్లిష్టమవుతాయని అన్నారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజన సరికాదని కావూరి పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేనేలేదన్నారు.హైదరాబాద్ మనదనుకుని పెట్టుబడులు పెట్టారని, రాష్ట్రం నలుమూల నుండి ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు.
ఐటీ, సినిమా, ఫార్మా, హోట్లు అభివృద్ధి చెందాయని, సంపన్న దేశాలకు పోటీ పడేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని కావూరి తెలిపారు. విభజన వద్దని 9 మంది కేంద్ర మంత్రులం చెప్పామని, భవిష్యత్లో వచ్చే ఇబ్బందులను అధిష్టానానికి వివరించామన్నారు. అందిరికీ అమోదయోగ్యంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి పునరాలోచించాలని కోరినట్లు కావూరి చెప్పారు.