కావూరి రాజీనామా.. దరిద్రం వదిలింది

 

 

 

దేశానికి, తెలుగు ప్రజలకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు రూపంలో పట్టిన దరిద్రం వదిలిందని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. గురువారం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో సీమాంధ్ర ప్రాంతంలో ఆనందోత్సాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి కేసీఆర్ కూడా చేయనంత ద్రోహాన్ని చేసిన కావూరి సాంబశివరావు రాజీనామాని అక్కడ అందరూ స్వాగతిస్తున్నారు. ఏ మంత్రి పదవి కోసమైతే సీమాంధ్ర ప్రజలకు కావూరి వెన్నుపోటు పొడిచాడో ఇప్పుడా మంత్రి పదవికి రాజీనామా చేయడం శుభ పరిణామమని వారు అంటున్నారు. పదవి లేకపోతే బతకలేని కావూరి ఇప్పుడు కాంగ్రెస్‌లో వుంటే తాను ఎంపీగా గెలవలేనన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నాడు. బీజేపీలో చేరాలని ప్లాన్ వేస్తున్నాడు. అయితే కావూరి ఏ పార్టీలో చేరినా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడించడం ఖాయమని సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. కావూరి లాంటి పదవీ వ్యామోహం వున్న వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పడానికి తామంతా సిద్ధంగా వున్నామన్నారు. కేవలం కావూరికి మాత్రమే కాకుండా కావూరిని చేర్చుకునే పార్టీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయమని వారు వార్నింగ్ ఇస్తున్నారు.