హీరోయిన్ మైత్రేయ రేప్ కేసు: మంత్రి కొడుక్కి బెయిల్

 

కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని, ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేంద్ర మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేసింది. మైత్రేయ కేసు పెట్టినప్పటి నుంచి కార్తీక్ గౌడ పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో కోర్టు కార్తీక గౌడ అరెస్టుకు వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కార్తీక్‌గౌడకు ఊరట లభించింది. అత్యాచారం, చీటింగ్ కేసులో కార్తీక్ గౌడకు బెంగుళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో మంత్రి సదానంద గౌడ కుటుంబానికి ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది.