జేసీ వర్సెస్ సిఐ.. బస్తీ మే సవాల్

 

ప్రస్తుతం అనంతపురంలో ఖద్దర్ వర్సెస్ ఖాకీ మాటల యుద్ధం నడుస్తోంది.. తెలుగు ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో, విలన్ల ఛాలెంజ్ లను తలపించేలా.. జేసీ దివాకర్ రెడ్డి, సిఐ మాధవ్ లు ఒకరిమీద ఒకరు పంచ్ డైలాగులు విసురుతున్నారు.. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తమ వర్గీయులపై దాడులు చేస్తోంటే పోలీసులు భయపడి పారిపోతున్నారనీ, హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.. దీంతో హర్ట్ అయిన ఖాకీలు అదే రేంజ్ లో జేసీకి కౌంటర్ ఇచ్చారు.. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సిఐ గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు.. మేము మగాళ్లం అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు.. తలతిక్కగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.. పోలీసులను హిజ్రాలతో పోల్చడం సభ్యసమాజానికే సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసారు.. అధికార అహంతో వ్యవహరిస్తే ఖబడ్దార్‌ అని అన్నారు.. జేసీ అసభ్యకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.