గవర్నర్ పై మండిపడ్డ కేకే
posted on Jun 21, 2013 9:42AM
తెలంగాణ ప్యాకేజీలకు సంబంధించి గవర్నర్ నరసింహన్ కేంద్రంలో మాట్లాడారన్న ప్రచారం నేపధ్యంలో మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నేత కే కేశవరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే కీలకమని, గవర్నర్ కేవలం రాష్ట్రపతి ఏజెంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాలను అణగతొక్కాలను కోవడం రాజ్యాంగానికి విరుద్ధమని గవర్నర్ పై కేకే విమర్శలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప..ప్యాకేజీలకు అంగీకరించేది లేదు అని కేకే స్పష్టం చేశారు. అధిష్టానం ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకోకుంటే… తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెంటనే బయటకు రావాలి అని కేకే పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో పదవి విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని కేకే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.