బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు జేపీ నడ్డా తీసుకోనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అప్పటి అధ్యక్షుడు అమిత్ షా నియమించారు. 2019 చివరిలో నడ్డా పార్టీ పగ్గాలు చేపడతారని వార్తలొచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈరోజు పార్టీ పగ్గాలు నడ్డాకు అప్పగించారు అమిత్ షా.