బిజెపితో పొత్తుకు సిద్దం: లోక్‌సత్తా

 

 

 

భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తాము సిద్దంగా వున్నామని, దానిపై ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నామని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. పొత్తులపై జాప్యం చేయడం సరికాదని ఆయన సూచించారు. ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన ఇస్తామని మోడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రుణమాఫీ వల్ల రైతులు నష్టపోతారని, రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తున్న పార్టీలకు ఆ హక్కు ఎవరిచ్చారని జేపీ ప్రశ్నించారు. వస్తు ఉత్పత్తి రంగాలను మెరుగు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. వచ్చే పదేళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే దేశంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని జేపీ అన్నారు.