ప్రభుత్వ ఉద్యోగానికి దేవీ ప్రసాద్ రాజీనామా

 

త్వరలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఎన్నిక అవడానికి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ ప్రస్తుతం మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అయితే దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించలేదు. ప్రభుత్వోద్యోగులు ఎన్నికలలో పోటీ చేయరాదన్న నిబంధన ఉండటంతో దేవి ప్రసాద్ రాజీనామా చేశారు.