కేసీఆర్‌ని జైల్లో పెడతారట!

 

 

 

అవసరమైతే కేసీఆర్‌ని జైల్లో పెడతామని కేంద్ర మంత్రి జేడీ శీలం ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆయన ఈ కామెంట్ పోలవరం ప్రాజెక్టు విషయంలో చేశారు. పోలవరం ప్రాజెక్టు నూటికి నూరు శాతం చట్టబద్ధమైన ప్రాజెక్టు అని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డు పడితే కేసీఆర్‌ని జైల్లో పెట్టి అయినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని జేడీ శీలం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వున్న జేడీ శీలం అమాయకత్వానికి మొదట అందరూ జాలిపడాలి. ఇదిలావుంటే, విభజన వల్ల ఎవరీకి నష్టం లేదని, సీమాంధ్రులు దోచుకుంటున్నారని మొత్తుకుంటున్న మారీచుల బారి నుంచి సీమాంధ్రులు విభజన పుణ్యమా అని తప్పించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.