అనిశ్చితి పాపం కాంగ్రెస్‌దే

 

ప్రస్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్ధితికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణం అన్నారు లోక్ స‌త్తా పార్టీ అధినేత జ‌య‌ప్రకాష్ నారాయ‌ణ‌, శుక్రవారం మీడియాతో స‌మావేశం అయిన ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభ‌జ‌నను కాంగ్రెస్ పార్టీ త‌మ సొంత పార్టీ విష‌యం భావించ‌డం వ‌ల్లే ప్రస్థుతం రాష్ట్రం ఇలా అగ్నిగుండాల మారింద‌న్నారు.

రాష్ట్రం విడిపోయినా ప్రజ‌లు ఒక‌టే అనే భావ‌న ప్రజ‌ల‌కు క‌ల్పించ‌టంలో కాంగ్రెస్ పార్టీ విఫ‌ల‌మ‌య్యింద‌న్నారు. రాష్ట్రం ఇలా అగ్ని గుండంలా ఉన్న దేశ ప్రదాని, హోం మంత్రులు స్పందించ‌క‌పోవ‌డం దారుణం అన్నారు. గత మూడేళ్లుగా అటు సీమాంధ్రలో, ఇటూ తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.