నా పరువుకి నష్టం జరిగింది: జయ కేసు

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనని పరువు నష్టం కేసు నమోదు చేశారు. సుబ్రమణ్య స్వామి తనమీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ జయలలిత కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దాంతో చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు అక్టోబర్ 30న కోర్టు ముందు హాజరు కావాలని డాక్టర్ సుబ్రమణ్య స్వామికి బుధవారం సమన్లు జారీ చేసింది. అలాగే, తమిళ జాలర్ల సమస్యలపై సుబ్రమణ్య స్వామి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళ దినపత్రిక దినమలర్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లకు కూడా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సమన్లు జారీ చేశారు.