ఏపీ అభివృద్ధికి సహకరిస్తామన్న జపాన్ బృందం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని జపాన్‌కి చెందిన ప్రతినిధుల బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జపాన్ ప్రతినిధి బృందం బుధవారం కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను జపాన్ బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పారిశ్రామికవాడలో భాగస్వాములం అవుతామని ఆ బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులను చేపట్టడానికి కూడా జపాన్ బృందం ఆసక్తి చూపించింది. 400 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి సహకరిస్తామని జపాన్ బృందం తెలిపింది.