జైరామ్ దృష్టిలో వీరంతా ఎవరు?

 

కేంద్రమంత్రి జైరామ్ రమేష్ అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు అత్యంత ప్రముఖుడు. మన రాష్రం కోటా నుంచే రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపిక చేసిన ఈ మేధావి కలహ ప్రియుడు. అంటే నారదుడి టైపు అన్నమాట. ఒకే నోరు.. కర్నూలులో ఒక మాట, కరీంనగర్ లో ఒక మాట ఇదీ జైరాం రమేష్ తీరు. తాజాగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణా ఇవ్వడం కోసం కాంగ్రెస్ 14 ఏళ్ళుగా రాముడిలా వన వాసం, పాండవులా అజ్ఞాత వాసం చేసిందన్నాడు. అయితే సీమాంధ్రులు కౌరవులా, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీతో పాటు ఇతర పార్టీలు రావణుడి టైపా? మరి ఈ విషయాలు కూడా చెబితే కదా ఎవరు రాముడో, ఎవరు రావణుడో తేలిపోయేది. తమరు పాండవులైతే .. కౌరవులెవరో చెప్పకుండా ఎలా తెలుస్తుంది సారూ..?