పురందేశ్వరిపై జైరాం సంచలన వ్యాఖ్యలు

 

 

 

బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిపై కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆమె వెన్నుపోటు పొడిచారని అన్నారు. పురందేశ్వరి ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పురంధేశ్వరి వేల ఎకరాల భూములు కొన్నారని, అక్కడే పోర్టు నిర్మాణం చేయాలని ఆమె కోరారని జై రామ్ రమేష్ ఆరోపించారు. అయితే తాము దుగరాజపట్నం వద్దే పోర్టు నిర్మించేందుకు నిర్ణయించామని జైరాం రమేష్ తెలిపారు. అందుకే పార్టీని వీడారని అన్నారు. 'ఆమె పచ్చి స్వార్థపరురాలిగా, కృతఘ్నురాలిగా వ్యవహరించారు. ఆమె నిజస్వరూపం బయటపడింది' అని జైరాం వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు కేంద్రం తగిన న్యాయం చేయలేదన్న పురందేశ్వరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆమె ఆరోపణలు నిరాధారమని, హుందాతనంగా లేవని జైరాం అన్నారు.